సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: దక్షిణ చత్తీస్గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తొలుత ఈనెల 26న శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల్లో ఒకరోజు ముందే 25న అల్పపీడనం ఏర్పడనుందని సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆ తర్వాత ఈ అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా వాయవ్య దిశలో తమిళనాడు వైపు పయనిస్తుందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదే సమయంలో కోస్తాంధ్రలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో కొన్నిచోట్ల సాధారణంగాను, మరికొన్ని చోట్ల సాధారణంకంటే తక్కువగాను ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం అత్యధికంగా అనంతపురం, కర్నూలులో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడచిన 24 గంటల్లో చింతపల్లి, పెద్దాపురంలలో 3, డెంకాడ, పాడేరు, పాతపట్నం, కళింగపట్నం, ఓర్వకల్లుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
కొనసాగిన అకాల వర్షాలు
రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ కటౌట్లు విరిగి పడ్డాయి. కళ్యాణ వేదిక వద్ద వీఐపీ షెడ్స్పై రేకులు ఎగిరిపోయాయి. జర్మన్ తరహా షెడ్స్ విరిగి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడ్డాయి. అక్కడున్న విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. ట్రాన్స్కో ఏడీ వెంకటేశ్వర్లు, ఏఈ విజయకుమార్రెడ్డి వెంటనే సంఘటనా ప్రదేశాలకు చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు.
గాలులకు చుట్టుపక్కల గ్రామాల్లో సూమారు 100 ఎకరాల మేర అరటి, నూగు పంటలు నేలకు ఒరిగాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో పిడుగు పడి నాలుగేళ్ల బాలుడు సుశాంత్ నాయక్ చనిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. చాలా మండలాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లా మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో పిడుగులు పడి భారీ వృక్షాలు నేలకొరిగాయి. గంగవరం మండలంలో కురిసిన వర్షానికి జీఎల్ఎస్ ఫారం ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
Published Tue, Apr 23 2019 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement