వెంకటాచలం: రైతులందరికీ సక్రమంగా అందాల్సిన యూరియాను అధికారపార్టీ అండతో కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులు రోజులకొద్దీ క్యూలలో నిల బడిన బస్తా కూడా యూరియా దొరకని పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది. కానీ కొందరు అధికారపార్టీకి చెందిన వారికి మాత్రం లారీల కొద్దీ యూరియా సునాయసంగా ఇళ్లకు చేరుతోంది. ఈ దారుణాన్ని వెంకటాచలం మండలంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు శనివారం వెలుగులోకి తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే.. లారీలో యూరియాను తరలిస్తుండగా వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అనుమానంతో మండల కేంద్రంలోని కసుమూరు రోడ్డు వద్ద అడ్డుకున్నారు. లారీ డైవర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదుచేశారు. లారీని అడ్డుకోవాలని, అక్కడకు తమ సిబ్బందిని పంపుతున్నట్లు ఏడీ సత్యవాణి తెలిపారు. ఈలోపే సంఘటనా స్థలానికి కనుపూరు, వడ్డిపాళెం గ్రామానికి చెందిన కొందరు వచ్చి లారీలోని యూరియా తమేదేనని, వెంటనే లారీని పంపించాలని వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విషయం తెలిసి స్థానిక ఎస్ఐ రహమతుల్లా తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా రైతులు తమ వద్ద ఉన్న బిల్లులు చూపారు. ఆ బిల్లులు పక్కనే ఉన్న మనుబోలు మండలంలోని సింహపురి కోఆపరేటివ్ సొసైటీవని గుర్తించారు. వ్యవసాయాధికారి రమణ పరిశీలించి రైతులు ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేయవచ్చునని వారికే వంతపాడారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సొసైటీ కింద రైతులకు అవసరం లేదా? బడా రైతులు లారీలకు లారీలు తీసుకెళ్తే చిన్నకారు రైతుల పరిస్థితి ఎమిటని నిలదీశారు.
దీంతో అక్కడకు చేరిన మిగతా చిన్నకారు రైతులు ఏఓ రమణతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఏడీతో మాట్లాడిన ఏఓ ఎరువులు అమ్మిన సొసైటీ నిర్వహకులపైన చర్యలకు సిపార్సు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల బిల్లులను పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తామని సర్దిచెప్పారు. అనంతరం లారీలో యూరియాను కనుపూరు గ్రామానికి తరలించారు. ఇదేవిధంగా మండలంలోని కసుమూరు, పాలిచెర్లపాడు, చవటపాళెం, గుడ్లూరివారంపాళెంలకు లారీల్లో యూరియా వెళ్లినట్లు స్థానిక రైతులు తెలిపారు.
రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు
గ్రామాల్లోని చిన్నకారు రైతులకు ప్రభుత్వం సొసైటీ ద్వారా అందజేస్తున్న యూరియాను పక్కదారిన మళ్లించి బడారైతులకు అధికారులు సహకరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య విమర్శించారు. రైతులు సొసైటీల వద్ద యూరియా కోసం రాత్రి, పగలు వేచి ఉంటే వారి భాధలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని పలుగ్రామాలకు వేరే మండలాల నుంచి యూరియాను లారీల్లో బడా రైతుల కోసం తరలిస్తున్నరని కానీ చిన్నకారు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పొలాలు లేని రైతుల పేరుతో దొంగబిల్లులు సృష్టించి యారియాను బడా రైతులకు అందజేస్తున్నట్లు ఆరోపించారు. చిన్నకారు రైతులకు న్యాయం జరగకపోతే వైకాపా ఆధ్వర్యంలో సొసైటీల వద్ద ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
యూరియా పక్కదారి
Published Sun, Jan 25 2015 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement