ఏఎన్యూ, న్యూస్లైన్ :సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల అసమర్ధత వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. సమైక్యాంధ్రప్రదేశ్ను కొనసాగించాలని కోరుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాష్ట్ర విభజన బిల్లు వచ్చినపుడు తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు.
సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోరుతూ సీమాంధ్రలో 110 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే, కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదవులకోసం పాకులాడడం నీచమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ జి.రోశయ్య, ఆచార్య పి.వరప్రసాదమూర్తి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జాన్సన్, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, కన్యాకుమారి, యుగంధర్రెడ్డి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఏఎన్యూ జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షలకు పలువురు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షలను సాయంత్రం ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
సీమాంధ్ర మంత్రుల వల్లే దుస్థితి
Published Tue, Nov 19 2013 2:12 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
కనిపించని ఏనుగు జాడ
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
ముగ్గురూ ఆడపిల్లలైనా..
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
Advertisement