ఘనంగా వేద విజ్ఞానపీఠం 123వ స్నాతకోత్సవం | Sakshi
Sakshi News home page

ఘనంగా వేద విజ్ఞానపీఠం 123వ స్నాతకోత్సవం

Published Fri, Aug 28 2015 1:42 AM

ఘనంగా వేద విజ్ఞానపీఠం 123వ స్నాతకోత్సవం

తిరుమల: తిరుమలలోని వేద విజ్ఞానపీఠం 123వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 68 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరికి యోగ్యతా పత్రాలు, నగదు బహుమతి, 10 గ్రాముల శ్రీవారి వెండి డాలరును టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బహూకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ  వేద పండితులుగా సనాతన హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. పీఠం ప్రిన్సిపాల్ కుప్పా వెంకట శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 131 ఏళ్ల చరిత్ర గల వేద విజ్ఞానపీఠంలోని 17 విభాగాల్లో 650 మంది విద్యార్థులు వేద, అనుబంధ విద్యను అభ్యసిస్తున్నారన్నారని తెలిపారు.

Advertisement
Advertisement