భద్రాచలం టౌన్, న్యూస్లైన్: ఇదేమీ సాయమంటూ ప్రజాప్రతినిధులు, అధికారులపై భద్రాచలం పట్టణంలో ఆదివారం వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి పునరావాస కేంద్రంలో ఉన్నా పట్టించుకున్న అధికారి, ప్రజాప్రతినిధి లేరంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై ధర్నా చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అడుగడుగునా నిర్లక్ష్యం...
రెండు రోజుల క్రితం గోదావరికి వరద ఉధృతంగా రావడంతో రాత్రికి రాత్రే కరకట్ట దిగువన ఉన్న సుభాష్నగర్ కాలనీలోని ఇళ్లలోని నీరు చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు అప్పటికప్పుడు సామగ్రి సర్దుకుని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ వారికి వసతులు కల్పించడంతో అధికారులు విఫలమయ్యారు. కావాల్సిన నిత్యావసరాలను అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారని, అలాగే చిన్న పిల్లలకు అవసరమైన పాలు, బ్రెడ్లను అందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజు లుగా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు బాధితులకు భోజనం, అల్పాహారం అందించారని, అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలదీసిన బాధితులు
అధికారుల నిర్లక్ష్యంపై జూనియర్ కళాశాల సెంటర్లో కూనవరం రహదారిపై బాధితులు ధర్నా చేస్తుండగా అక్కడకు భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిలు రావడంతో బాధితులు కోపోద్రిక్తులయ్యారు. రెండు రోజులుగా పునరావాస కేంద్రంలో కష్టాలు పడుతుంటే ఇప్పుడు వస్తారా..? అంటూ వారిని నిలదీశారు. బాధితులు వారిని చుట్టుముట్టడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వారు సముదాయించేందుకు యత్నించినప్పటికీ బాధితులు శాంతించలేదు. మా గోడు మీరే చూడండంటూ వారిని పునరావాస కేంద్రంలోకి తీసుకెళ్లారు. కనీసం తాగునీరు కూడా లేదంటూ కళాశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ట్యాంకర్ను చూపించారు. అదేవిధంగా బియ్యం, పప్పు, పిల్లలకు పాలు, బ్రెడ్లను కూడా అందించలేదని అన్నారు.
తిండిపెట్టని ప్యాకేజీలు ఎందుకు...?
వరద బాధితులకు స్పెషల్ ప్యాకేజీలు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిలకు వినతిపత్రం అందజేశామని, త్వరలోనే స్పెషల్ ప్యాకేజీ వస్తుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పేర్కొనగా బాధితులు మరింత కోపోద్రిక్తులయ్యారు. కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న తమకు సరైన తిండి పెట్టకుండా స్పెషల్ ప్యాకేజీలంటూ హామీలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ముంపునకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం నేటికీ అందలేదని ఆరోపించారు. తక్షణమే నెల్లిపాక వరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి వెంటనే సెక్టోరియల్ అధికారి, పోలవరం డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేష్ను అక్కడికి పిలిపించి బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బాధితులకు సత్వరమే సహాయం అందించాలంటూ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిలు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి వెనుతిరిగారు.
అధికారులపై వరద బాధితుల ఆగ్రహం..
Published Mon, Aug 5 2013 6:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement