జి.మామిడాడ(పెదపూడి) : జి.మామిడాడ గ్రామంలోని ఐదు రేషన్ షాపులపై రాజమండ్రికి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నాలుగు షాపుల్లో సరకులు సీజ్ చేశారు. తహసీల్దార్ ఎం.సావిత్రి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు తెలిపారు. జి.మామిడాడ గ్రామంలోని 20, 22, 23, 24, 25 నంబర్ల షాపులపై విజిలెన్స్ తహ సీల్దార్ గోపాలరావు, డీసీటీఓ రత్నకుమార్, ఎస్సై సత్యనారాయణ తమ సిబ్బందితో ఏకకాలంలో మూడు షాపులపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 22వ షాపులో రూ.2,386 విలువైన రేషన్ సరకును సీజ్ చేశారు. బియ్యం రికార్డులకంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
పంచదార 105 కిలోలు తక్కువగా, కిరోసిన్ 4 లీటర్లు ఎక్కువగా ఉంది. 23వ షాపులో రూ.9,994 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 1,924 కిలోలు, పంచదార 14 కిలోలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కిరోసిన్ 344 లీటర్లు ఎక్కువగా ఉంది. 24వ షాపులో రూ.7,317 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 288 కిలోలు, పంచదార 27 కిలోలు, కిరోసిన్ 282 లీటర్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 25వ షాపులో రూ.4,721 విలువైన సరకు సీజ్ చేశారు. బియ్యం 47 కిలోలు, కిరోసిన్ 42 లీటర్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 20వ నంబర్ షాపులో సరకు వ్యత్యాసం లేదు.
నాలుగు రేషన్ షాపుల నిర్వహణ బాధ్యతలను వేరేవారికి అప్పగించారు. సరకు తేడా ఉన్న షాపుల నిర్వాహకులపై నిత్యావసర సరకుల చట్టం ప్రకారం ెకేసు నమోదు చేయనున్నట్టు తహసీల్దార్ సావిత్రి, ఎంస్ఓ కె.విశ్వేశ్వరరావు తెలిపారు.
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
Published Wed, Apr 13 2016 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement