వెయ్యి బస్తాల శెనగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

వెయ్యి బస్తాల శెనగలు స్వాధీనం

Published Fri, Sep 18 2015 2:39 PM

Vigilance raid on Sai siva fried grams industries

ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు వెయ్యి బస్తాల శెనగలు, పప్పులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సాయిశివ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీస్‌పై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ డీఎస్పీ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో సంస్థలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.37 లక్షలకు పైగా విలువైన శెనగలను సీజ్ చేశారు. కాగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement