విశాఖపట్నం: గణపతి ఉత్సవాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన విజయగణపతి లడ్డూను వేలంలో రికార్డు ధరకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. నగరంలో ఆర్అండ్బీ జంక్షన్ ఏర్పాటు చేసిన విజయగణపతి విగ్రహం అందర్ని ఆకట్టుకుంది.
వేలంలో విజయగణపతి లడ్డూ రూ.12.75లక్షలు పలికింది. వేలంలో లడ్డూని దక్కించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటి పడ్డగా నిర్వాహక కమిటీ సొంతం చేసుకుంది.
ఇక అమీర్పేట్ వీవీఆర్ రియల్ ఎస్టేట్ గణేష్ లడ్డూను వేలంలో రూ.10లక్షల 8వేలు రూపాయలకు వీవీఆర్ కంపెనీ ఎండీ దక్కించుకున్నారు.