ప్రదీప్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి పరామర్శ | Sakshi
Sakshi News home page

ప్రదీప్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి పరామర్శ

Published Sat, Nov 5 2016 8:23 PM

ప్రదీప్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి పరామర్శ - Sakshi

అగనంపూడి (విశాఖ): హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం పరామర్శించారు. వారం రోజుల కిందట విశాఖ జిల్లా కశింకోట సమీపంలో ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై విద్యార్థులు, ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అగనంపూడి నిర్వాసితకాలనీ దానబోయినపాలెంలోని ప్రదీప్ ఇంటికి విజయసాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు వెళ్లి తల్లిదండ్రులు సత్యవతి, రాములును ఓదార్చారు.

హంతకులకు శిక్ష పడేంత వరకు విడిచి పెట్టేదిలేదని ఆయన హామీ ఇచ్చారు. నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అన్యాయమని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా నిందితులను పోలీసులు కాపాడాలనుకోవడం సరికాదన్నారు. జిల్లా ఎస్పీని కలిసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతామని చెప్పారు. విజయసాయిరెడ్డితో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్‌ఆర్‌సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement