యలమంచిలి/మొగల్తూరు : హిమాచల్ప్రదేశ్లోని కులుమనాలి సమీపంలోని నదివద్ద గల హైడ్రోపవర్ ప్రాజెక్ట్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో మరణించిన విద్యార్థినుల్లో ఒకరైన ఆకుల విజేత స్వగ్రామం యలమంచిలి మండలం కంచుస్తం భంపాలెం. ఈ గ్రామానికి చెందిన ఆకుల సూర్యకుమార్, పద్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరికి ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె హైదరాబాద్లోనే ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చేస్తోంది. రెండో కుమార్తె విజేత హైదరాబాద్లోని బాచుపల్లిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజి నీరింగ్ కళాశాలలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది.
కంచుస్తంభంపాలెంకు చెందిన ఆమె తాత రంగారావు బీఈ ఎలక్ట్రికల్ చదివారు. విజయవాడలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆయన ఆ తరువాత మిలటరీలో మేజర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం కంచుస్తంభంపాలెంలో సత్యసాయి ఆసుపత్రిని నెలకొల్పి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. రంగారావుకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె నందిత ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె భర్త కూడా మిలటరీలో పని చేస్తున్నారు.
రెండో కుమార్తె ఉష. ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు సూర్యకుమార్. హైదరాబాద్లో ట్రాక్టర్ ఇంజినీరింగ్ వ్యాపారం చేస్తున్నారు. రంగారావు కంచుస్తంభంపాలెంలోనే ఉండటంతో వేసవి సెలవులు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే సందర్భాల్లో సూర్యకుమార్ కుటుంబ సభ్యులంతా ఇక్కడకు వస్తుంటారని సూర్యకుమార్ చిన్నాన్న కొడుకు ఆకుల సూర్యనారాయణ తెలిపారు. విజేత మరణించిందన్న సమాచారం తెలియడంతో ఆమె తాత రంగారావు సోమవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విజేత మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇలా అవుతుందనుకోలేదు
చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తన అక్క మనుమరాలు ఆకుల విజేత నదిలో కొట్టుకుపోరుు మరణించడం తమ దురదృష్టమని ఆరేటి రాజా వాపోయూరు. విజేత బతికే ఉంటుందనుకున్నానని అన్నారు. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన అక్క మనుమరాలు మరణించిందన్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టడీ టూర్లో భాగంగా హిమాచల్ప్రదేశ్లోని కులుమనాలి ప్రాంతానికి వెళ్లిన విజేత నదిలో గల్లంత్యయిదని తెలిసి రాత్రంతా టీవీ చూస్తూ జాగారం చేశానని తెలిపారు. సూర్యకుమార్, పద్మ దంపతులకు కుమారులు లేరని, కుమార్తెలనే కొడుకులుగా చూసుకుంటున్నారని అన్నారు. వారికి ఉన్నత చదువులు చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు భగవంతుడు తీరని అన్యాయం చేశాడని కన్నీటి పర్యంతమయ్యారు.
గంగమ్మ మింగేసింది
Published Tue, Jun 10 2014 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement