అచ్చంపేట, న్యూస్లైన్: నల్లమల అటవీప్రాంతంలో చలి, ఈదురుగాలులకు చెంచులు వణికిపోతున్నారు. మంచు తుంపరకు బొడ్డు గుడిసెలు, గుడారాలు తడిసి ముద్దవుతున్నాయి. పక్కాఇళ్లు లేకపోవడంతో గుడిసెల్లోనే చలి మంటలు కాచుకుంటూ బతుకుజీవుడా.. అంటూ కాలం గడుపుతున్నారు. ఎముకలు కొరికే చలిలో అడవిబిడ్డలు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా నల్లమలలోని కోర్ ఏరియాలో జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులు మరింత దుర్భరంగా మారాయి.
అప్పాపూర్,పుల్లాయిపల్లి, రాంపూర్, బౌ రాపూర్, సంగడిగుండాలు, బక్కచింతపెంట, ఫర్హాబాద్, మేడిమొల్కల, తాటిగుండాలు, ఇర్లపెంట, ఆగర్లపెంట, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట తదితర ని వాసప్రాంతాల్లో చెంచులు చలికి వణికిపోతున్నాయి. ఇక్కడ ఏ పెంటల్లోనూ పక్కాఇళ్లు లేవు. వీరు ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. 40 ఏళ్లనాడు ఎలా ఉన్నామో ఇప్పు డు అలాగే ఉన్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి ఎన్ని రోజులు తాము చెట్లకింద జీవించాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు.
కనిపించని దోమ తెరలు
దోమల నుంచి రక్షణ పొందేందుకు చెంచులకు దోమతెరలు ఎంతో అవసరం. కానీ వాటిని అందిండంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమైంది. ఐదేళ్ల క్రితం పంపిణీ చేసిన దోమ తెరలు పనికి రాకుండా పోయాయి. గతంలో ఏటా ప్రభుత్వపరంగా చలికాలంలో చెంచులకు దోమతెరలు అందించేవారు. ఇప్పుడు వీటి ఊసేలేకపోవడంతో దోమలతో చెంచులు మలేరియా, డెంగీ వ్యాధుల బారినపడుతున్నారు. మలేరియా వైవాక్స్, మాలేరియా ఫాల్సీఫెరమ్ వ్యాధుల నివారణకు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలి జ్వరాలతో బాధపడే వారి నుంచి రక్తపూత సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇంతవరకు వైద్యులు అక్కడికి వెళ్లిన దాఖలాల్లేవు.
దయనీయస్థితిలో చెంచులు
రాష్ట్రంలోని మహబూబ్నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఐటీడీఏ లెక్కల ప్రకారం 36వేల మంది చెంచు జనాభా ఉంటే జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 112 చెంచుగూడెల్లో 7500 జనాభా ఉంది. చెంచుల పక్కా ఇళ్లు కలగానే మిగిలాయి. ఉన్న ఇళ్లలో సరైన వసతులు లేకపోవడంతో చెంచులు ఇబ్బందుల మధ్య కాలం గడుపుతున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, లిం గాల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, హన్వాడ, మండలాల్లోని గిరిజన గూడెల్లో అసంపూర్తిగా కూలిపోతున్న ఇళ్ల మ ద్య గిరిపుత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు.
చెంచుల క ష్టాలు చూడలేని రెడ్క్రాస్ సంస్థ వారు గుడారాలను అందజేసింది. కొన్నిగాలికి లేచిపోగా ఉన్నకొన్ని కూడా చిరిగిపోయాయి. వాటిలోకి క్రిమికీటకాలు, విషసర్పాలు చేరుతుండటంతో అందులో ఉండలేని పరిస్థితి నెలకొంది. అడవిలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ చలితో చెట్లకింద ఎంతకాలం ఇబ్బందులు పడాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆదుకోవాలని గిరిపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గూడెం గజగజ..
Published Sun, Dec 22 2013 4:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement