నాలుగు ప్రాంతాల గుర్తింపు
{పైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యత
సంస్థ ద్వారా విధివిధానాల రూపకల్పన
విశాఖపట్నం : విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ తీరానికి రానుంది. డీ కమిషన్ చేసిన తర్వాత ఇక్కడకు తీసుకొచ్చేందుకు కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. విరాట్ రాకకు సంబంధించిన విశేషాలను మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్ వివరించారు. అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రభుత్వాదేశాల మేరకు వుడా వీసీ బాబూరావునాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించారు. విరాట్ కొలువుకు పది ప్రాంతాలు ఎంపిక చేసినప్పటికీ వుడా పార్కు, తెన్నేటి పార్కు, జోడుగుళ్ల పాలెం, సాగర్నగర్ ప్రాంతాలను విరాట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒకచోట విరాట్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపించారు.
ఈ నాలుగు ప్రాంతాలను నిపుణులతో కూడిన కమిటీ కూడా పరిశీలించే అవకాశాలున్నాయి. డీ కమిషన్ తర్వాత విశాఖ తీరానికి తీసుకొచ్చేందుకు రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. విరాట్ ఏర్పాటు చేసే ముందుగానే ఈ నౌకను పూర్తి మ్యూజియంగా మార్పు చేయనున్నారు. వాణిజ్యపరంగా కూడా లాభదాయకంగా ఉండేందుకు అనువుగా ఈ నౌకను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వీటి నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం కన్సల్టెన్సీ కోసం క్రైసల్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ నౌకను పార్కింగ్ చేసే ప్రదేశంలో అవసరమైన మౌలిక వసతులను నౌక వచ్చే నాటికి సమకూర్చాల్సి ఉందని, ఇప్పటికే ఏ రకమైన సదుపాయాలు కల్పించాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. స్థల ఎంపిక ఖరారైతే ప్రభుత్వ అనుమతులతో మౌలికవసతుల కల్పనకు సంబంధించిన పనులకు శ్రీకారం చుడతామన్నారు.
ఫిబ్రవరిలో తీరానికి విరాట్
Published Wed, Mar 23 2016 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement