వీఆర్వో అభ్యర్థుల సెలక్షన్ జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

వీఆర్వో అభ్యర్థుల సెలక్షన్ జాబితా విడుదల

Published Sat, Mar 1 2014 2:15 AM

VRO candiates selection Release list

అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత పొందినవారి సెలెక్షన్ జాబితాను విడుదల చేశారు. 64 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 1:2 నిష్పత్తిలో 126 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. మొత్తం 64 పోస్టుల్లో ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా అన్నీ సక్రమంగా ఉన్న వారు 49 మందిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులు ఎక్స్‌సర్వీస్‌మెన్ జాబితాలో అనర్హులుగా గుర్తించారు. ఆరుగురు వికలాంగుల ధ్రువీకరణపత్రాలు సరైనవా, లేదా అన్నది తేలాల్సిఉంది. మరో నలుగురు అభ్యర్థులు సర్టిఫికెట్లను సమర్పించలేదు. ఓసీ ఉమెన్, ఎస్టీ జనరల్ ఇద్దరు అభ్యర్థులు ఇంటర్వ్యూలకకు గైర్హాజరయ్యారు.
 
 ఎంపికైన అభ్యర్థుల జాబితా వివరాలు
 ఓసీ జనరల్...  1వ ర్యాంకు  బి.యోగానందరెడ్డి , 2 జీ.మోహన్‌కుమార్ నాయుడు, 4 చీమల వెంకట నరసయ్య,5 జీకే ముకుంద, 6 ఏ.మనోహర,7 కొర్రపాటి శేషాచలం,8 జంపన ప్రభాకర్, 9 బిల్లే మారుతీప్రసాద్, 10 రాఘవేంద్రరావు ,11 కమ్మ సుధాకర్ ,12  ముత్తులూరి సందీప్,
 ఓసీ మహిళ... 49వ ర్యాంకు భోజనపు సుశీల, 66 మండ్లి పల్లవి, 78 పైనేని స్వర్ణలత, 103 అక్కిశెట్టి గౌతమి,146 ఎల్.హేమలత
 ఎస్సీ జనరల్... 68వ ర్యాంకు జీ అనిల్‌కుమార్,85 ఎం బాలప్ప,101 వై.శివకిరణ్, 108 దేవర నాగేంద్ర, 126 ఎస్.వెంకటేశులు
 ఎస్సీ మహిళ... 487వ ర్యాంకు  ఎన్ శివమ్మ, 594 హరిజన రమాదేవి , 945 పీ.లావణ్య
 ఎస్టీ జనరల్...99వ ర్యాంకు ఎరికల అమర్‌నాథ్, 165 కే.శ్రీలక్ష్మీ
 ఎస్టీ మహిళ... 3026వ ర్యాంకు ఎన్.పార్వతి, 3500 సుగాలి అనితాబాయి
 బీసీ-ఏ జనరల్...  30వ ర్యాంకు కావలి శివకుమార్
 బీసీ-ఏ మహిళ... 147వ ర్యాంకు యు.పద్మావతి, 200 ర్యాంకు కమ్మరచేడు కవిత
 బీసీ-బీ జనరల్... 13వ ర్యాంకు ఎం.బషీర్, 18 పీ.ముకుంద ,21 జీ.నాగేంద్రబాబు,23 కుమ్మర వేణుగోపాల్,31 జీ.గోవింద రాజులు
 బీసీ-బీ మహిళ .. 246వ ర్యాంకు వర్ది శిరీష ,315 మల్లెల లక్ష్మీదేవి
 బీసీ-డీ జనరల్... 14వ ర్యాంకు కిలారి జయప్రకాశ్,17 కటిక శ్రీకాంత్, 109 కట్టుబడి గంగాధర్
 బీసీ-డీ మహిళ ..295వ ర్యాంకు జే.సునీతాబాయి, 565 బాల సునీత
 బీసీ-ఈ జనరల్... 80వ ర్యాంకు షేక్ రబ్బానీ, 84 ఎస్.అయూబ్‌ఖాన్, 157 మోకా నూర్ మహ్మద్
 బీసీ-ఈ మహిళ.. 409వ ర్యాంకు షేక్ గౌసియా బేగం
 ఎక్స్ సర్వీస్‌మెన్ - జనరల్..1172వ ర్యాంకు పెదసాని నవీన్ కుమార్, 4892 ముల్లా అబ్దుల్ ఖుద్దుష్
 
 3లోగా సర్టిఫికెట్లతో హాజరుకండి  
 అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో 64 గ్రామ రెవెన్యూ అధికారుల పొస్టుల భర్తీలో భాగంగా ఇంత వరకు సర్టిఫికెట్లు తీసుకురాని అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా సర్టిఫికెట్లతో హాజరుకావాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం లెక్చరర్స్‌కాలనీకు చెందిన షమీమ్ (25వ ర్యాంక్ ఓసీ-ఉమెన్), ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఎరుకుల శ్రీనివాసులు (127 ర్యాంక్ ఎస్టీ జనరల్), అనంతపురం రెవెన్యూ కాలనీకి చెందిన జీవకీర్తన (3,281 ర్యాంకు బీసీ-సీ- ఉ మెన్), బుక్కపట్నం మండలం క్రిష్ణాపురానికి చెందిన సుధాకర( 33వ ర్యాంకు బీసీ-డీ-జనరల్), తాడిపత్రి మండలం క్రిష్ణాపురానికి చెందిన శివప్రకాష్‌రెడ్డి (850 ర్యాంక్-వీహెచ్ జనరల్)గల అభ్యర్థులు ఇంత వరకు సర్టిఫికెట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. నిర్దేశించిన సమయంలోగా సర్టిఫికెట్లు సమర్పించకపోతే తరువాతి అభ్యర్థికి ఎంపిక ఉత్తర్వులు  జారీ అవుతాయని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement