సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా రైతులకు 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817.85 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో 8.20 లక్షల ఖాతాలు రుణమాఫీకి అర్హత సాధించాయి. వాటికి సంబంధించి రూ.4,944.24 కోట్లు మాఫీ కావాలి. ఇందులో రూ.3,093.06 కోట్లు పంట రుణాలు, రూ.1851.18 కోట్లు బంగారు రుణాలు రద్దవ్వాలి. ప్రభుత్వం పంట, బంగారు రుణాలు కలిపి రూ.2,956 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది.
ఇదీ బంగారు అప్పుల లెక్క
జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల మంది రైతులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రూ.1851.18 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే.. ప్రభుత్వం 1.32 లక్షల ఖాతాల్లో రూ.905.12 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. తక్కిన 79,939 ఖాతాల్లోని రూ.946.06 కోట్లు మాఫీ కాలేదు. ప్రకటించిన మొత్తంలోనూ తక్షణ రద్దు కింద (మొదటి విడతలో) రూ.218.42 కోట్లు మాఫీ చేసింది. తక్కిన మొత్తాన్ని ఐదేళ్లలో రద్దు చేస్తామని తెలిపింది.
ప్రభుత్వం తక్షణం మాఫీ చేసిన రూ.218 కోట్లు రైతులు తీసుకున్న బంగారు రుణాలపై వడ్డీకి కూడా చాలదు. ప్రభుత్వమిచ్చిన మాట ప్రకారం ఏటా 20 శా తం రుణమాఫీ చేసినా... వడ్డీనే 14-18 శాతం అవుతుందని బ్యాం కర్లు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ఐదేళ్లలో వడ్డీ మాత్రమే మాఫీ చేసే పరిస్థితి. దీంతో తీసుకున్న రుణాలను రుణమాఫీతో సంబంధం లేకుండా గడువులోగా చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చే స్తున్నారు.
పత్రికల్లో రోజూ వేలం ప్రకటనలు
బంగారు రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకర్లు ప్రతి రైతుకు నోటీసులు జారీ చేస్తున్నారు. రైతుల పేర్లు, తీసుకున్న రుణం, వేలం తేదీలను పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని చూసి కొంతమంది రైతులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో కుదేలవుతున్న ‘అనంత’ రైతులకు పూటగడవడమే కష్టంగా ఉంది. కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలసెళ్లి పనులు చేసుకుంటున్నారు. పనులు చేసే సత్తువ లేని వారు చర్చిలు, మసీదులు, ఆలయాల్లో భిక్షాటనకు సిద్ధపడుతున్నారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో రుణం తిరిగి చెల్లించలేక బంగారాన్ని బ్యాంకులకే వదిలేస్తున్నారు. ఇంకొందరు అవమానభారంతో ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా చోటుచేసుకున్నాయి.
చిత్తశుద్ధి లేని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు
రాష్ట్రంలోని 13 జిల్లాలలో ‘అనంత’ను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు, కరువు ప్రభావాన్ని ఏ ప్రాంతంతోనూ పోల్చలేము. అప్పుల బాధ తాళలేక గత 15నెలల్లో 101 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం రైతుకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీస్థానాలను ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. అయితే.. జిల్లా పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు.
వ్యవసాయ రుణాలు : రూ. 6,817 కోట్లు
మాఫీకి అర్హత : రూ.4,944 కోట్లు
బంగారు రుణాలు : రూ.1851.18 కోట్లు
మాఫీకి అర్హత : రూ.905.12 కోట్లు
మాఫీ కానివి : రూ.946.06 కోట్లు
ప్రస్తుత మాఫీ : రూ.218.42 కోట్లు
నాలుగేళ్లలో మాఫీ అయ్యేవి : రూ.686.70కోట్లు
మాఫీ మాయ
Published Mon, Sep 7 2015 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement