=డీడీ తీయొద్దని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు
=పిండి వంటలకు దూరంకానున్న సామాన్యులు
బాలసముద్రం, న్యూస్లైన్ : సంక్రాంతి ముంగిట సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాసిరకం గోధుమపిండి పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న సర్కారు... తాజాగా పామారుుల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండుగ వేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకుల్లో కోత పెడుతుండడంపై వారు మండిపడుతున్నారు.
డీడీ తీయకండి...
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు డీడీలు చెల్లించాలి. అయితే జనవరి కోటాకు సంబంధించి పామాయిల్ మినహా మిగిలిన వస్తువులకు డీడీలు తీయాలంటూ రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ చివరి నిమిషంలో అయినా... పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పామాయిల్ సరఫరా కష్టమేనని తెలుస్తోంది.
గత నెలలోనూ కోతే...
జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెలా 2,113 రేషన్ దుకాణా ల ద్వారా 9.80 లక్షల పామారుుల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గతనెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ను సరఫరా చేయలేదు. అరవై శాతం కో తతో కేవలం 3.98 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసింది. తాజాగా ఈ నెలలో మొత్తం కోటాకు కోత పెట్టింది.
నాసిరకం గోధుమపిండి, చింతపండు
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న తొమ్మిది వస్తువుల్లోగోధుమపిండి పూర్తిగా నాసిరకంతో ఉం టోంది. పురుగులతో కూడిన పిండిని కొనుగోలు చేసేందుకు రేషన్ లబ్ధిదారులు జంకుతున్నారు. దీం తో కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వలు పేరుకుపోయూయి. దీనికి సంబంధించి జనవరి కోటాలో 30 శాతం మేరకు మాత్రమే డీడీలు వచ్చాయి. చింతపండుదీ ఇదే పరిస్థితి. రేషన్ దుకాణాల్లో చింతపండు అమ్మకం 10 శాతం దాటడం లేదు.
పామాయిల్ లేనట్టే..
Published Fri, Jan 3 2014 2:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
24గంటలూ పోలీసు నిఘా
మోదీ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ
ఫ సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
రెండో విడత ర్యాండమైజేషన్
పట్టభద్రుల స్థానానికి మూడో రోజు నలుగురు నామినేషన్లు
ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తి వడదెబ్బతో మృతి
మహిళ మృతదేహం లభ్యం
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బాబుకు భంగపాటు
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement