Sakshi News home page

దాహం.. దాహం..!

Published Fri, Feb 6 2015 2:13 AM

water

బిందె నీళ్లు రూ.8కు కొంటున్నాం
 తాగడానికి బిందెడు మంచి నీరు కూడా అందడం లేదు. దాహం తీర్చుకోవడానికి బిందె నీరు రూ.8తో కొనుగోలు చేసి తాగుతున్నాం. ఐదారేళ్ల నుంచి మంచి నీటి కోసం నానా అవస్థలు పడుతున్నాం.
 
  ఒక్కొక్క రోజు ఉప్పు నీళ్లు కోసం కూడా తంటాలు పడుతుంటాం. ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం ఏర్పాటు చేశారు. వృధ్యాపం మీద పడటంతో కేంద్రానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోలేం. ఒకవేళ ఆపసోపాలుపడి అక్కడికెళ్లి బిందె నీళ్లు తెచ్చే సరికి కాళ్లు గుంజుతాయి. ముసలోల్లం కిందపడితే కాళ్లు విరుగుతాయి. ఊర్లో కుళాయిలు, పంపులు అన్నీ ఉన్నాయి. నీరు వచ్చేందుకు అధికారులు ఏదో ఒకటి చేస్తే ముసలోల్లం బతుకుతాం.
 

Advertisement
Advertisement