అర్ధవీడు (కంభం రూరల్) : గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల గ్యాప్ నుంచి తాగునీటిని అందించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి చెప్పారు. ఇందుకుగాను 600 కోట్ల వ్యయంతో వాటర్గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధవీడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రజాసదస్సు నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల ప్రజలు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాభావం వల్ల వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటున్న విషయాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాకర్ల గ్యాప్ నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేసి తాగునీటిని అందించే వాటర్గ్రిడ్ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ైరె తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన వెంటనే గ్రామాలకు తాగునీరు అందించే వాటర్గ్రిడ్ ను అధికారులు ప్రారంభిస్తారని చెప్పారు.
నిధులను దుర్వినియోగం చేయొద్దు
మండల అభివృద్ధికి మంజూరయ్యే నిధులను అధికారులు దుర్వినియోగం చేయకుండా అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సూచించారు. మండల ప్రజలు తాగునీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావించడంతో.. ఎంపీడీఓ శామ్యూల్తోపాటు ఇతర అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలానికి మంజూరైన నిధుల్లో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని చెప్పారు. యాచవరంలో 40 చెంచు కుటుంబాలు వారు ఎమ్మెల్యేను కలిసి తమకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు మంజూరు చేయించాలని కోరగా తాను జనవరి మొదటి వారంలో శ్రీశైలం ఐటీడీఏ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
మాగుటూరులో టీడీపీ నేత కర్ణం కాశయ్య వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాశయ్య నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షించాలని కోరగా.. ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ శామ్యూల్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ ఏరువ రంగారెడ్డి, నారు అశోక్రెడ్డి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మొహీద్దీన్పురం సర్పంచ్ బండారు రంగారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలిరెడ్డి, అయ్యవారిపల్లి సర్పంచ్ బాలరంగాచారి, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శామ్యూల్, రమేష్రెడ్డి, పశువైధ్యాధికారి హరిబాబు పాల్గొన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్గ్రిడ్
Published Thu, Jan 1 2015 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement