- వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ దుట్టా విమర్శ
- న్యాయ విచారణకు డిమాండ్
- ట్రెంచ్ పనులు అడ్డుకున్నారని అరెస్ట్
హనుమాన్ జంక్షన్ : నీరు-చెట్టు పథకం పేరుతో మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ వైద్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని, అవినీతి జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం, కె.సీతారాంపురం గ్రామాల పరిధిలోని బాలయ్య చెరువుకు ఏకపక్షంగా ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ డాక్టర్ దుట్టా శుక్రవారం ఆ పనులను అడ్డుకున్నారు.
దీంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనను అరెస్టుచేసి పోలీస్స్టేషన్కి తరలించారు. జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీలు బేతాళ ప్రమీలారాణి, మంగలపాటి కమలకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు చిన్నాల లక్ష్మీనారాయణ, వెలగపల్లి ప్రదీప్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దుట్టా విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి లక్షా 50వేల ట్రక్కులు, టిప్పర్లతో చెరువు పూడిక మట్టి రియల్ ఎస్టేట్లకు తరలించారన్నారు.
ట్రక్కుకు రూ.400, టిప్పరుకు రూ.2,500 వరకు వసూలుచేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. మీటరు లోతు తవ్వాల్సిన చెరువులను మూడు నుంచి ఆరు మీటర్ల వరకు తవ్వి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలు, మిలటరీ కోటాలో చెరువు భూమిని పొందిన వారికి ఎటువంటి హెచ్చరికలు, నోటీసులు లేకుండా తవ్వకాలు జరపడాన్ని ఖండించారు. వైఎస్సార్ సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న కోడూరుపాడు, వీరవల్లి, వేలేరు గ్రామాల చెరువుల్లో నీరు-చెట్టు పథకాన్ని అమలు చేయకుండా నిరుపేదలు ఉన్న ప్రాంతాల్లో దారుణాలకు పాల్పడటం విచారకరమన్నారు.
నీరు-చెట్టు పథకం పేరుతో దోచుకుంటున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ అంగీకరించి మట్టికి రూ.80 పైగా సొమ్ము వసూలుచేసిన వారి దగ్గర నుంచి నగదు వెనక్కి ఇప్పిస్తానని ప్రకటించడం గమనించాలని దుట్టా చెప్పారు. గుడివాడలో ఐదు ఎకరాల చెరువు మట్టికి ప్రభుత్వం వేలం నిర్వహిస్తే రూ.24 లక్షలకు పాడుకున్నారని తెలిపారు. నిబంధనలతో నిమిత్తం లేకుండా మట్టి తవ్వకాలు కొనసాగనిచ్చేది లేదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మట్టి కుంభకోణం రూ.150 కోట్లు
Published Sat, May 16 2015 4:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement