మేం రాజధానికి వ్యతిరేకం కాదు:వైఎస్ఆర్ సీపీ | Sakshi
Sakshi News home page

మేం రాజధానికి వ్యతిరేకం కాదు:వైఎస్ఆర్ సీపీ

Published Mon, Dec 22 2014 10:42 PM

శ్రీకాంత్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: తాము రాజధానికి వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత రైతుల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. మార్కెట్ యార్డ్ బిల్లును దొంగచాటుగా సభలో ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Advertisement
Advertisement