పెట్టుబడుల కోసం ఆహ్వానించాం: పల్లె | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల కోసం ఆహ్వానించాం: పల్లె

Published Fri, Nov 6 2015 8:29 PM

we have invited nris for investments, says ap minister raghunath reddy

అమెరికా పర్యటనలో పలు కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించినట్లు ఏపీ ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 48 మంది ఎన్నారైలు ఐటీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని పల్లె చెప్పారు.

జపాన్ నుంచి మూడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, అమరావతిలో భాగస్వాములు అయ్యేందుకు ఎన్నారైలు ముందుకొస్తున్నట్లు తెలిపారు. 17.91 లక్షల ఈ-బ్రిక్స్ కొనుగోలు చేసేందుకు వాళ్లు అంగీకారం తెలిపారన్నారు.

Advertisement
Advertisement