- వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల సమావేశంలో నేతల పిలుపు
నరసరావుపేట రూరల్ : టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్టీ కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశాన్ని పట్టణంలోని విజయ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అధికారులతో కలసిచేస్తున్న తప్పుడు పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారుల మెడకు చుట్టుకునే రోజులు వస్తాయన్నారు.
గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశాన్ని ఈ నెల 8న తెనాలిలో నిర్వహిస్తామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలను కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తడం ద్వారా ప్రజలకు చేరువ కావచ్చన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. పట్టణాల్లో పార్టీని పటిష్టపరిచేలా కౌన్సిలర్లు, కన్వీనర్లు పనిచేయాలన్నారు.
సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి రోజు వార్డుల్లో పర్యటించాలన్నారు. దీంతోపాటు సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు సంఘటితం కావాల్సిన పరిస్థితులను టీడీపీ కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. డివిజన్లో నెలకొన్న దారుణ పరిస్థితికి సభాపతి కోడెల శివప్రసాదరావే కారణమని విమర్శించారు. రాజకీయాన్ని రౌడీయిజంవైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాల్టీల్లో ఏకపక్ష పాలన సాగుతోందన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు నేతలందరితో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో అధికార పార్టీకి దీటుగా బదులివ్వాలన్నారు. సమస్యలు వచ్చినప్పడు అవసరమైతే ఉద్యమం చే పడతామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్లీడర్లు మాగులూరి రమణా రెడ్డి, ఎన్.వెంకటరామిరెడ్డి, సీహెచ్.సాంబశివరావు, ఆర్.రమాదేవి, రేపాల శ్రీనివాస్, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్బాబు, పట్టణ కన్వీనర్ షేక్హనీఫ్, డిప్యూటీ ఫ్లోర్లీడర్ పాలపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందాం
Published Tue, May 5 2015 5:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement