నెల్లూరు(అగ్రికల్చర్): అన్నదాతలను యూరియా కష్టాలు వీడటం లేదు. రైతులు ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయాల వద్ద కాచుకు కూర్చున్నా బస్తా కూడా చేతికి అందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు. శుక్రవారం కూడా జిల్లాలో పలు ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల ఎదుట అన్నదాతలు బారులు తీరారు. రోజంతా యూరియా కోసం క్యూలో నిలబడ్డా బస్తాకూడా అందకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.
వ్యవసాయ శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు అధికార పక్షాల పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జానకి స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అదుపులోకి రాలేదంటే యూరియా సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గత ఏడాది రబీ సాగుకు 96వేల మెట్రిక్ టన్నులు రాగా ఈ ఏడాది ప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.
అలస్యంగా సీజన్ ప్రారంభం కావడం, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, వచ్చిన ఎరువులు సైతం బ్లాక్ మార్కెట్కు తరలిపోతుండటం రైతులు కునుకు లేని రాత్రులను గడుపుతున్నారు. సీజన్ దాటిపోతుండటంతో యూరియా కోసం రైతులు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో విఫలం చెందారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
రైతన్న కన్నెర్ర
మనుబోలులోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పీఏసీఎస్లో యూరియా కోసం మండుటెండను లెక్క చేయకుండా అన్నదాతలు బారులుతీరారు. రైతులు భారీగా క్యూలో ఉండటంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మకూరు ఎసై రంగంలోకి దిగి రైతులను చెదర కొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సైదాపురంలోని సొసైటీ ఎదుట యూరియాకోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
యూరియా కొరత లేకుండా చూస్తాం
Published Sat, Jan 24 2015 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement