ఏపీని ఆదుకుంటాం: జైట్లీ | Sakshi
Sakshi News home page

ఏపీని ఆదుకుంటాం: జైట్లీ

Published Fri, Oct 28 2016 1:47 PM

ఏపీని ఆదుకుంటాం: జైట్లీ

విజయవాడ: విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీపై బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏపీకి కేంద్రం సాయం చేస్తోందన్నారు.  పలు కేంద్ర విద్యాసంస్థలను ఇప్పటికే ఇచ్చామని జైట్లీ చెప్పారు.

నాబార్డు ద్వారా పోలవరానికి నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. సమర్థ నాయకత్వంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో మోదీ నిరూపించారని అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో దేశం దూసుకెళుతోందని జైట్లీ అన్నారు. అంతర్జాతీయంగా పాక్ను ఏకాకి చేయడంలో విజయం సాధించామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement