తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధమున్నా.. ఎవరున్నా వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఎర్రచందనం మాఫియాకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే తిరుపతి పట్టణంలో కమిషనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల యూనిఫామ్ ను మార్చ ప్రసక్తి లేదని, యథాతథంగా కొనసాగిస్తామన్నారు.