'2018 జూన్ లో ఏపీ రాజధానిని ప్రారంభిస్తాం' | Sakshi
Sakshi News home page

'2018 జూన్ లో ఏపీ రాజధానిని ప్రారంభిస్తాం'

Published Mon, Mar 9 2015 5:51 PM

'2018 జూన్ లో ఏపీ రాజధానిని ప్రారంభిస్తాం' - Sakshi

హైదరాబాద్:ఏపీ రాజధానిని 2018 జూన్ లో ప్రారంభిస్తామని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ బృందం ఈ జూన్ లో మాస్టర్ ప్లాన్ ఇవ్వనుందని.. తర్వాత ఓ ఏజెన్సీ ద్వారా రాజధానిలో కేటాయింపులు జరుపుతామన్నారు. సోమవారం ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణం ఆలస్యం చేయాలని కొందరు చూస్తున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ వ్యవస్థను సరిచేశామని.. ఆరు శాతం విద్యుత్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించామన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు అందించాలని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినట్లు బాబు తెలిపారు. 

 

ఈక్రమంలోనే గోదావరి జిల్లాల సాగునీటికి ఇబ్బందికి కలగనివ్వమన్నారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై స్పష్టంగా సమాధానం చెప్పాలని సభ్యులకు సూచించారు. మంత్రుల ఇంకా సబ్జెక్ట్ పై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలందరూ బాగా స్టడీ చేయాలని బాబు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement