బెయిల్‌ రావడాన్ని హర్షిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ | Sakshi
Sakshi News home page

బెయిల్‌ రావడాన్ని హర్షిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్

Published Mon, Sep 23 2013 9:00 PM

we will walk wiht ys jaganmohan reddy for united state, says congress mla madhu sudhan gupta

గుంతకల్(కర్నూల్):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి బెయిల్ రావడాన్ని హర్షిస్తున్నామని గుతంకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడానికి జగన్ ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఉంటాయని ఆయన అన్నారు.

 

జగన్మోహన రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.  క్విడ్‌ప్రోకో కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేయడం పూర్తి చేసామని, ఇక తమ దర్యాప్తు ముగిసిందని  కూడా సీబీఐ  వెల్లడించింది.  సుప్రీం కోర్టు సూచనల మేరకు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.  బెయిల్పై  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు బెయిలు మంజూరు చేసింది.  

 

 

Advertisement
Advertisement