వెంకయ్యనాయుడు స్పష్టీకరణ
సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉంది. సీమాంధ్ర న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో విభజన జరగాలి’’ అని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. లోక్సభ రభసకు పూర్తి బాధ్యత కాంగ్రెస్దేనన్నారు. సభ జరగకుండా చేసి, బీజేపీని విభజన వ్యతిరేకిగా చిత్రించడానికే ఈ కుట్రలు పన్నుతున్నార ని శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. సభలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసేలా వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యమైన విభజన బిల్లు పెట్టే సమయంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సభలో లేకపోవడం శోచనీయమన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలను విని పరిష్కార చర్యలపై చర్చించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్కు పోయేకాలం రావడం వల్లే దింపుడు కళ్లం ఆశతో ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 300కు పైగా లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్ రెండంకెలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. విభజనకు ముందు కొన్ని డిమాండ్లపై బీజేపీ తరఫున ప్రణాళికా సంఘం అంగీకారం కోరుతున్నామన్నారు. ఆ డిమాండ్లు...
సీమాంధ్రలో నిధులు, రాబడి కొరతను ఎలా ఎదుర్కొంటారో చెప్పాలి
రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణకు రాయితీలు ప్రకటించాలి
తెలంగాణలో కరెంట్ కోత భయం లేకుండా కేంద్రం బాధ్యతలు తీసుకోవాలి. 4,000 మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
సీమాంధ్రకు తొలి ఏడాది ఏర్పడే లోటును కేంద్ర సంచిత నిధి నుంచి భర్తీ చేయాలి. దీన్ని ఆర్థిక సంఘానికి నివేదించాలి
విశాఖ, తిరుపతిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, బిజినెస్ స్కూల్, హార్టికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ మాదిరి విశాఖకూ ఐటీఐఆర్ మంజూరు చేయాలి
విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి. ముంబై-ఢిల్లీ తరహాలో విశాఖ-చెన్నై కారిడార్ను అభివృద్ధి చేయాలి
హైదరాబాద్లో ఉన్నవారికి ప్రాంతాలతో సంబంధం లేకుండా పూర్తి రక్షణ కల్పించాలి
కొత్త రాజధాని ఏర్పాటు, నిధుల కేటాయింపుపై సమగ్ర ప్రణాళిక ఇవ్వాలి
విభజనపై బీజేపీది ఒకే మాట
Published Sun, Feb 16 2014 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement