కలెక్టరేట్, న్యూస్లైన్: సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అధికారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల విజయవంతం కోసం జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా విద్య, సన్నిహిత, మార్పు, వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమాల తీరుపై కలెక్టర్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ఆయా పథకాల లక్ష్యాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
జిల్లా వ్యాప్తంగా 556 ఉన్నత పాఠశాలల్లో 277 రెడ్, 243 ఎల్లో గ్రేడింగ్లో ఉన్నాయని, ఆయా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గణితం, ఇంగ్లిష్, సామాన్య శాస్త్రంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, ఆయా పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలకు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులతో పాటు నాణ్యతతో కూడిన మెనూను అమలు చేసేందుకు సన్నిహిత కార్యక్రమం పేరిట దత్తత అధికారులను నియమించామన్నారు. వారంతా ఈనెల 15వ తేదీలోగా ఆయా వసతి గృహాలను సందర్శించి 15లోగా నివేదికను సాంఘిక సంక్షేమాధికారికి అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో బాలల ఆరోగ్య పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని, స్థానిక వైద్యాధికారులతో కలిసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమన్వయంతో ‘మార్పు’ను సాధించాలి
ఐసీడీఎస్, ఐకేపీ, ఆర్డబ్ల్యూఎస్, మెప్మా, డీఎంహెచ్ఓ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణుల గుర్తింపు, వైద్య పరీక్షలు, హైరిస్కు గర్భిణులను గుర్తించడం, పౌష్టికాహార పంపిణీ తదితర అంశాలపై గ్రామైక్య సంఘాలతో విధిగా చర్చించి, ఆయా సమావేశాలకు ఏఎన్ఎంలు హాజరయ్యేలా చూడాలన్నారు. విధిగా పీహెచ్సీ కేంద్రాలను తనిఖీ చేసి నిర్దేశించిన జాబితా ప్రకారం ఈనెల 15లోగా నివేదిక అందజేయాలన్నారు. వసతి గృహాల్లో స్కైప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
బీఆర్జీఎఫ్ పనుల జాప్యంపై ఆగ్రహం
డివిజన్ స్థాయిలోన బీఆర్జీఎఫ్ పనులపై సమీక్ష నిర్వహించినా సంబంధిత పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011-12కు సంబంధించి పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు నమోదులో సిద్దిపేట డివిజన్లో 1751 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారని, వీరికి వెంటనే కార్డులు జారీ చేస్తామని శరత్ తెలిపారు.
లబ్ధిదారుల వద్దకే పింఛన్లు
సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై నిర్దేశిత సమయంలో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను కలెక్టర్ఆదేశించారు. 500 మంది లబ్దిదారులకు ఒకరు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా 2 నుంచి 7వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మ, డీపీఓ ప్రభాకర్రెడ్డి, సీపీఓ గురుమూర్తి, ఆర్డీఓలు ధర్మారావు, వనజాదేవి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
Published Wed, Dec 4 2013 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement