రూ. 18 లక్షల విలువైన 61.6 తులాల బంగారం స్వాధీనం
అనంతపురం క్రైం : అనంతపురం వన్టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో నలుగురు దొంగలను పట్టుకున్నారు. వీరినుంచి రూ. 18 లక్షలు విలువ చేసే 61.6 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్బాబు శనివారం వన్టౌన్ పోలీస్స్టేసన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం నగరం బుడ్డప్పనగర్కు చెందిన షికారి సద్సింగ్ అలియాస్ శీనా, నీరు షికారి అర్జున్, నీరు షికారి రామకృష్ణతో పాటు కదిరి పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ అలియాస్ టీపాను అరెస్టు చేశారు.
వీరిలో సద్సింగ్, అర్జున్, రామకృష్ణ ఒక గ్యాంగ్. వీరు ముగ్గురు స్వయానా బంధువులతో పాటు స్నేహితులు. తాగుడు, జూదం అలవాట్లకు మరిగిన వీరు దొంగతనాలకు ఎంచుకున్నారు. ఉదయం పూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తుంచుకుని రాత్రిపూట తాళాలు పగులకొట్టి ఆ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు. ఎస్బీఐ కాలనీ, హౌసింగ్బోర్డుకాలనీ, హమాలీకాలనీ, వినాయకనగర్, నీరుగంటివీధి, అశోక్నగర్, కల్పనాజోష్కాలనీ, నవోదయకాలనీ, మరువకొమ్మకాలనీ, తారకరామాకాలనీల్లో ఈ ముటా గత రెండేళ్లలో 13 చోరీలకు పాల్పడింది.
మరో నిందితుడు షేక్ అహ్మద్ కదిరి ప్రాంతంలో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. గతనెల 22న హౌసింగ్బోర్డుకాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకోవాలనే నినాదంతో జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దొంగతనాలపై నిఘా పెంచారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి పర్యవేక్షణలో అనంతపురం డీఎస్పీ నాగరాజ ఆదేశాల మేరకు వన్టౌన్ సీఐ గోరంట్లమాధవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి దొంగలపై కన్నేశారు.
ఈ క్రమంలో శనివారం నలుగురు దొంగల్లో ముగ్గురిని బీరప్పగుడి సమీపంలో, మరొక దొంగ షేక్ అహ్మద్ను కలెక్టర్ కార్యాలయం ఎదుట పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వె ళ్లే సందర్భాల్లో ప్రజలు సంబంధిత పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు.
దొంగలు దొరికారు..
Published Sun, Nov 9 2014 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement