సాక్షి, పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కఠిన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. పెనుగొండలో మసీదు వీధి, ఉర్రేంకుల వారి వీధి, కొండపల్లివారి వీధిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో వీటి పరిధిలో 820 మీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించారు. ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పెనుగొండ పంచాయతీలో కాల్సెంటర్ 08819–246081 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే అత్యవసరమైన నిత్యావసరాలు, మందులు వారి చెంతకే అందేవిధంగా ఏర్పాటు చేశారు. వీటికి నగదు చెల్లించాలి.
డ్రోన్లతో పర్యవేక్షణ
పోలీసులు రక్షణ దుస్తులు ధరించి నిత్యం పర్యవేక్షణ చేస్తూ డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా డ్రోన్లకు చిక్కితే కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు.
ప్రజలు సహకరించాలి: మంత్రి
పెనుగొండ: పెనుగొండ కరోనాకు నెలవుగా మారడంతో వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజ్ఞప్తిచేశారు. కరోనా నిరోధానికి పెనుగొండలో తీసుకొంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ 250 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. పెనుగొండలోని మూడు ప్రమాదకర ప్రాంతాలను కలిపి రెడ్జోన్గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రానివ్వొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే మూడో విడత ఆరోగ్య సర్వే ప్రారంభమైందన్నారు. ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సత్వరం ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. చదవండి: కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్
కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు
Published Sat, Apr 11 2020 8:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement