దేవాలయ పునర్నిర్మాణంలో అవినీతి?
లక్షల్లో దాతల సొమ్ము దుర్వినియోగం
దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టు దేవాలయం పునర్నిర్మాణంలో తలో చేయి వేసి లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశారని భక్తులు వాపోతున్నారు. దాతల సొమ్ముతోనే నిర్మించినట్టు ఓ వైపు చెబుతుంటే దేవాదాయ శాఖ విడుదల చేసి రూ.25 లక్షలు ఏమయ్యాయని గ్రామస్తులు నిలదీయడంతో నీళ్లు నములుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామంలో ఉన్న దేవాలయ పునరుద్ధరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి పునర్నిర్మాణం కోసం నిధులు రాగా, మరోవైపు దాతల నుంచి కూడా నిధులు భారీగా వసూలు చేశారు. ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేసినట్లు శిలాఫలకం వేసిన అధికారులే, దాతలు ఇచ్చిన సొమ్మును కూడా శిలాఫలకాల్లో చూపించారు. ఈ పనుల్లో అధికారులు కుమ్మక్కై భారీగా దాతల సొమ్ము నొక్కేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు దేవాదాయ శాఖ కమిషనర్కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే...
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం జీనోద్ధరణ పనులకు దేవాదాయ శాఖ ద్వారా రూ.25.65 లక్షల అంచనాలు ఆమోదం పొందాయి. వీటిని టెండర్లు పిలిచి పనులూ పూర్తి చేశారు. ఈ పనికి ఖర్చయిన రూ.25 లక్షల ఖర్చులో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద దేవస్థానం నిధుల నుంచి రూ.8.55లక్షలు, ప్రభుత్వ సీజీఎఫ్ గ్రాంట్ నుంచి రూ.17 లక్షలు వచ్చాయి. ఈ పనులన్నీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి పి.వెంకట్రావు నేతృత్వంలో పూర్తి చేశారు. కానీ ఇదే పనులకు పొందూరు గ్రామ నివాసులైన వేజండ్ల రామారావు, కనమర్లపూడి వెంకట శేషరావు తదితరులు రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ తరపున సుమారు రూ. 55 లక్షల వరకూ వసూలు చేసి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు శిలాశాసనం చెక్కించారు.
ఒకే పనిని తామంటే తాము చేసినట్లుగా దేవాదాయ శాఖ, పునర్నిర్మాణ కమిటీవారు చెప్పుకుంటున్నారు. దేవస్థానం గోడలపై ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రకారం మొత్తం 80 లక్షల రూపాయల వరకూ ఖర్చయినట్లు కనపడుతోంది. వాస్తవంగా ఈ పనికి డిపార్టుమెంట్ రూ.25 లక్షలు మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే దాతలు వసూలు చేసిన మొత్తం దుర్వినియోగమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రహరీగోడ దగ్గర నుంచి నందీశ్వరుడు, కరెంట్ ఫ్యాన్లు, కరెంట్ కనెక్షన్, మెయిన్ గేట్ తదితర అన్ని పనులనూ చేయించినట్లు దాతలు తమ పేర్లతో శిలాఫలకాలను గుడి ఆవరణలో వేశారు.
దాతలు డిపార్టుమెంట్ నిర్ణయించిన పనులు పూర్తిగా వారి స్వంత నిధులో చేయించినట్లు శిలాఫలకాలు ఉన్నపుడు దేవస్థాన ఇంజినీర్లు బిల్లులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ ప్రతిష్ట సమయంలో కమిటీ లేకపోయినా కమిటీ ఉన్నట్లు ప్రొటోకాల్ బోర్డులలో రాయించడంపై ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు చేపడతాం
టంగుటూరు మండలం పొందూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగినట్లు, నిధులు దుర్వినియోగమైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. రుజువైన పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతాం. సీజీఎఫ్ కింద కేటాయించిన నిధులను వెనక్కు తీసుకుంటాం. అవకతవకలలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాత్ర ఉందని తేలితే ఆయనపైకూడా చర్యలు తీసుకుంటాం.
- వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
దేవా... ఇదేమి స్వాహా
Published Wed, Jul 29 2015 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement