నెలాఖరులోగా నిర్ణయం: గల్లా జయదేవ్ | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా నిర్ణయం: గల్లా జయదేవ్

Published Mon, Jan 20 2014 3:22 AM

నెలాఖరులోగా నిర్ణయం: గల్లా జయదేవ్ - Sakshi

కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలని లేదు కదా?: గల్లా జయదేవ్
 చిత్తూరు, న్యూస్‌లైన్: తన రాజకీయ అరంగేట్రంపై ఈ నెలాఖరులోగా నిర్ణయం ప్రకటిస్తానని మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోరదానపల్లెలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.  తిరుపతి, చిత్తూరు ఎంపీ స్థానాలు రిజర్వుడ్ కావడంతో గుంటూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, ఈ మేరకు టీడీపీ నేతలతో సంప్రదిం పులు జరుపుతున్నానని తెలిపారు.
 
 మీ తల్లి వేరే పార్టీ లో ఉన్నారు కదా అని అడగ్గా ‘ ఫ్యామిలీ సభ్యులంతా ఒకే పార్టీలో ఉండాలని లేదు కదా?  ఉదాహరణకు గాంధీ కుటుంబమేన’ని అన్నారు. కాగా,  మంత్రి అరుణకుమారి స్పందిస్తూ  జయదేవ్ ఏ  పార్టీలో చేరినా తన సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అని ప్రశ్నించగా ‘ఇంకా సమయం ఉంది. చూద్దాం’ అనిఅన్నారు.

Advertisement
Advertisement