బాలాజీనగర్(రేణిగుంట): గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పంచాయతీల వారీగా అనుబంధ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ సమీపంలోని బాలాజీనగర్లో పర్యటించారు.
గాజులమండ్యం సర్పం చ్ శ్రీరాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్ల సహకారంతో ఐదేళ్లలో అన్నివిధాలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి కుటుంబానికి రుణిపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలను కాపాడే బాధ్యత తనదేనన్నారు.
తిరుపతి(రేణిగుంట) విమానాశ్రయం విస్తరణ పనులు ఏడాది లోపు పూ ర్తయ్యేలా కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్గజపతిరాజును కోరామన్నారు. విదేశాలకు విమాన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. మన్నవ రం ప్రాజెక్టును ఉత్పత్తి స్థాయికి తీసుకొచ్చేం దుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో చర్చించామన్నారు. ఎస్ఎస్ కెనాల్, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేలా పోరాడతామని ఆయ న పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై సేవ చేస్తా
ప్రజలకు మేలు చేసేందుకు వారితో మమేకమై పార్టీలకతీతంగా సేవ చేస్తామని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నా రు. నిస్వార్ధంగా సేవ చేసే మంచి నాయకుడి ని తిరుపతి ఎంపీగా ఎన్నుకున్నారని ప్రజల ను అభినందించారు. మాజీ ఎంపీ చింతామోహన్ చివరలో సర్పంచులకు వీధిలైట్లు ఇచ్చి మోసం చేశారే తప్ప అభివృద్ధి అంటే ఏమిటో ఆయని ఎరుగడని విమర్శించారు. ఎస్సీల ఇళ్లలో మంచినీళ్లు కూడా తాగడానికి ఆయనకు ఇష్టం ఉండదన్నారు.
జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కులాలు, పార్టీలను చూసి పాలన చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను షరతులు, కమిషన్లు ఏర్పాటు చేయకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణస్వామిని గాజులమండ్యం సర్పంచ్ శ్రీరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, ఎలమండ్యం సర్పంచ్ చిన్నికృష్ణయ్య, నాయకులు మోహన్, స్థానికులు, వార్డుమెంబర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
Published Thu, Jun 26 2014 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement