మచిలీపట్నం, న్యూస్లైన్ : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే బాపులపాడు, పెదపారుపూడి మండలాల్లో ఆమె మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారని పేర్కొన్నారు. రైతుల కోసం రూ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామని ప్రటించారని గుర్తుచేశారు.
ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటలు కోల్పోతే ఆదుకునేందుకు, దెబ్బతిన్న పంటలను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఈ నిధి నుంచి ఖర్చుచేస్తామని వివరించారు. జిల్లాలో వ్యవసాయం పైనే అధికశాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు పక్కా ఇళ్ల మంజూరునే పాలకులు విస్మరించారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించేందుకు డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ.200 పింఛన్ను రూ.700లకు పెంచుతామని జగన్మోహన్రెడ్డి ప్రకటించారని తెలిపారు. బాపులపాడు మండలంలోని రేమల్లె, మల్లవల్లి తదితర గ్రామాల్లో పార్టీ బాపులపాడు జెడ్పీటీసీ అభ్యర్థి కైలే జ్ఞానమణి, ఇతర నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
పెదపారుపూడి మండలంలోని పెదపారుపూడి, చినపారుపూడి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మూల్పూరి హరీష, గొరిపర్తి శ్రీలక్ష్మితో కలిసి పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.
రైతులను ఆదుకుంటాం
Published Wed, Apr 9 2014 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement