కావలిపురం (ఇరగవరం) : కావలిపురంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణిచింది. తమ బిడ్డను అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్న భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఫ్యాన్కు చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, అత్తమామలు చెబుతున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇవి.. మొగల్తూరకు చెందిన కడలి మీనాక్షి(23), అదే గ్రామానికి చెందిన కట్టా శ్రీనివాసరావుకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాసరావుకు రూ. 1.80 లక్షల కట్నం ఇచ్చారు.
వివాహ సమయానికి అతను ఆ గ్రామంలో కేబుల్ ఆపరేటర్. పెళ్లయిన మూడు నెలలకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అతను భీమవరంలో పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు సంతానం కలిగారు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే పెద్ద మొత్తంలో కట్నం వచ్చేదని సూటిపోటి మాటలతో మీనాక్షిని ఆమె భర్త, అత్తమామలు మంగమ్మ, వెంకటేశ్వరరావు వేధిస్తుండేవారని మృతురాలి బంధువులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మర ణించింది. పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు, ఇరగవరం ఎస్సై వీఎస్వీ భద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె భర్త, అత్తమామలను విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హత్య అనే అనుమానం !
పడకగది తలుపు వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా మీనాక్షి ఉరి వేసుకుని ఉందని ఆమె భర్త, అత్తమామలు చెబుతున్నారు. డాబా మెట్ల మీదనుంచి జారిపడి గాయాలపాలైందని తమ అల్లుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పాడని మీనాక్షి తల్లిదండ్రులు తెలిపారు. ఇక్కడకు వచ్చాక ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారని వారు వాపోయారు. తమ కుమార్తెకు ఫోన్ చేసిన ప్రతిసారీ భర్త, అత్తమామలు హింసిస్తున్న తీరును వివరించేందని, సంసారమన్నాక చిన్న తగాదాలు వస్తుంటాయి సర్దుకుపోవాలని నచ్చజెప్పేవాళ్లమని తెలిపారు. ఇలా ప్రాణాలు తీస్తారని అనుకోలేదని విలపించారు. ఆమె ఉరి వేసుకున్న ఆనవాళ్లు శరీరంపై లేవని, ఆమె వ జాకెట్టు చిరిగి ఉండటంతో మృతికి ముందు పెనుగులాడినట్టు స్పష్టమవుతోందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Published Thu, Mar 10 2016 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement