పింఛను కోసం వెళ్లి వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

పింఛను కోసం వెళ్లి వృద్ధురాలి మృతి

Published Sat, Apr 2 2016 6:23 PM

Woman dies of Sunstroke

ప్రొద్దుటూరు టౌన్ (వైఎస్సార్ జిల్లా) : ‘పింఛన్ తీసుకుని వస్తానమ్మా’ అని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఓ వృద్ధురాలు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వెంకటేశ్వర్లుపేటలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 39వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో పింఛన్ పంపిణీ జరుగుతోంది. ఈ వార్డులో 250 మందికిపైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.

గుడిమి లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలు ఉదయం 9 గంటలకు పింఛన్ కేంద్రం వద్దకు వెళ్లి చాలా సేపు ఎండలో నిల్చుంది. 10.30 గంటలకు పింఛన్ తీసుకుని, కుమారుడు శివ ఇంటికి వెళుతూ దారిలో కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.

Advertisement
Advertisement