జగనన్న సీఎం అయితేనే అక్కచెల్లెమ్మలకు రక్ష | Sakshi
Sakshi News home page

జగనన్న సీఎం అయితేనే అక్కచెల్లెమ్మలకు రక్ష

Published Mon, Sep 3 2018 7:30 AM

Woman Safety With YS Jagan Ruling - Sakshi

విశాఖపట్నం : మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో మహిళలు ఆర్థిక అభ్యున్నతి సాధించడంతో పాటు తమ సొంత అన్న, తండ్రి రక్షణలో ఉన్నామన్న ధీమాలో ఉండేవారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి అన్నారు. మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా మాడుగుల నియోజకవర్గం కొత్తపెంటలో ఆమె విలేఖర్లతో మాట్లాడారు. మహిళలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్సార్‌ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో మహిళలు దారుణంగా వంచనకు గురయ్యారన్నారు. జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అక్కచెల్లెమ్మల మోముల్లో మళ్లీ చిరునవ్వులు పూస్తాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement