మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళలు | Sakshi
Sakshi News home page

మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళలు

Published Sun, Jul 16 2017 4:19 PM

Women protest against liquor shop

విజయవాడ: నగరంలోని భవానీపురంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలోని మద్యం సీసాలను మహిళలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ముందు రోజులతరబడి ధర్నాలు చేస్తున్నా దుకాణాన్ని తొలగించకుండా విక్రయాలు జరుపుతుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కసారిగా దుకాణంలోకి వెళ్లి మద్యం సీసాలను పగులగొట్టారు. అనంతరం వైన్‌ షాప్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురు మహిళలపై భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement