వివాహితపై ఇద్దరు యువకుల అత్యాచారం | Sakshi
Sakshi News home page

వివాహితపై ఇద్దరు యువకుల అత్యాచారం

Published Tue, Mar 4 2014 1:01 PM

women raped by youngsters

హైదరాబాద్:మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ శృతిమించుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అనాగరిక చర్యలకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా మృగాళ్ల వైఖరిలో మార్పు మాత్రం రావడం లేదు. ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటున్న ఆ మహిళలపై ఇద్దరు యువకుల కన్నుపడింది.

 

ఈ క్రమంలోనే ఆ మహిళ ఒంటరిగా ఉందని భావించిన వారు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అడ్డువచ్చిన బాధితురాలి స్నేహితుడిపైనా ఆ దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.  ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Advertisement
Advertisement