ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Published Mon, Jul 6 2015 9:00 AM

women suicide with two childrens vijayanagaram distirict

విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మండల పరిధిలోని తినవేమలి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంగారమ్మ(29) తన కుమార్తె చిట్టి(4), కొడుకు చరణ్‌తేజ(10 నెలలు) తో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement