ఒంగోలు అర్బన్: మహిళలు అన్నింటా ముందుండాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఆమె ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. సుజాత మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని సూచించారు. అధికార పార్టీ మహిళా అధికారులు, ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేయడం దురదృష్ట కరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం చిన్నతనం నుంచి అలవాటు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పోకల అనూరాధ మాట్లాడుతూ మహిళలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలన్నారు.
మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర మాట్లాడుతూ రాజకీయాల్లో, చట్ట సభల్లో స్త్రీలకు ప్రాముఖ్యం కలిగిస్తే మహిళా సాధికారత సాధించేందుకు వీలవుతుందన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు కావూరి సుశీల, రమణమ్మ, అరుణ, పురిణి ప్రభావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగరాజు, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్థన్రెడ్డి, సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెపు మురళి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, నాయకులు తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, పి. జేమ్స్ హాజరయ్యారు.
ముందంజలో ఉన్నారు
ఒంగోలు సెంట్రల్: మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్–1 అధికారి గోపి అన్నారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో కె. నిర్మలాదేవి అధ్యక్షతన సభ జరిగింది. ప్రభుత్వం స్త్రీలకు ప్రత్యేక చట్టాలు అమలు జరిగే విధంగా చూడాలన్నారు. పి. మల్లికార్జునరావు, డి. నరసింహారావు, జె. నరసింగరావు, ఎన్. వి. సుబ్బారావు, ఆర్. శ్రీనివాస్, సంధ్యారాణి, నిర్మలాదేవి, సులోచనా రాణి, రత్న మంజరి తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే మహిళాభివృద్ధి
ఒంగోలు టౌన్: విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్ ఉద్బోధించారు. సాధారణ ఉద్యోగి నుంచి కంపెనీ సీఈఓల వరకు మహిళలు ఎదిగారంటే అది విద్య ద్వారా అన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయ సమావేశపు హాలులో ప్రసంగించారు. ప్రాజెక్టు డైరెక్టర్ జి. విశాలాక్షి మాట్లాడుతూ మహిళలు మార్పును ఆహ్వానించాలని, దాని గురించి ఆలోచించి ఆచరించేందుకు ప్రయత్నించాలన్నారు.
అడిషనల్ డీఎంహెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని కిశోర బాలికలను ఆరోగ్య విషయంలో చైతన్యవంతులను చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, అడిషనల్ డీఎంహెచ్ఓలు ప్రశంస పత్రాలు అందజేశారు. మహిళా సాధికారత గురించి పలువురు ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి.
మహిళలు ముందడుగు వేయాలి
Published Thu, Mar 9 2017 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement