వైఎస్సార్సీపీతోనే మహిళాభివృద్ధి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీతోనే మహిళాభివృద్ధి

Published Sat, Mar 15 2014 1:17 AM

womens development only with ysrcp

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: మహిళాభివృద్ధి  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీమోహన్‌రెడ్డి సతీమణి ఎస్వీ విజయమ్మ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకొని జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె నగరంలోని 15వ వార్డు గడ్డా వీధిలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ విజయమ్మకు వార్డు మహిళలు సాదరంగా ఆహ్వానం పలికారు.
 
 ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మహిళలకు పెద్దపీటవేశారని, పొదుపు మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి తండ్రిబాటలో పయనిస్తున్నారని చెప్పారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం  మైనారిటీ నాయకులు ఉస్తాద్ మహెబూబ్, ఉస్తాద్ రిజ్వాన్, రాజ్‌ధార్‌ఖాన్, మహెబూబ్‌ఖాన్, నజీర్, హకీం, మగ్బూల్, బాబు, అస్లం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement