మేడికొండూరు : రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నీచ రాజకీయాలకు నాంది పలుకుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా ఇన్చార్జి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడికొండ నియోజకవర్గ విస్త్రృతస్థాయి సమావేశం గురువారం పేరేచర్లలో నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. సంతలో పశువులని కొనుగోలు చేసిన మాదిరిగా ఎమ్మెల్యేను కొంటున్నారని మండిపడ్డారు. సిగ్గూఎగ్గూ లేకుండా అధికార, ధన దాహంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు.
ఎమ్మెల్యేలతోరాజీనామా చేయించాలి: అంబటి
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మాత్రం కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన టీడీపీ నేతలకు సైతం తాము అండగా ఉంటామని, ల్యాండ్ పూలింగ్ సమయంలో ఒకలా నటించిన చంద్రబాబు, ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు. సిగ్గుమాలిన ఎమ్మెలేలు వస్తే, సిగ్గుమాలిన చంద్రబాబు, లోకేష్లు వారి చేత రాజీనామా చేయించి, గెలిచిన తరువాత పార్టీలోకి తీసుకోవాలని సవాల్ విసిరారు.
ఎటువంటి నష్టం లేదు
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు నలుగురు వెళ్ళినంతమాత్రాన తమకు ఎటువంటి నష్టం లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిచింన ఎమ్మెల్యేలు చరిత్ర హీనులుగా మిగిలిపోవటం తథ్యమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ముస్తఫా మాట్లాడుతూ ఎట్టి పరిస్ధితుల్లోనూ వైఎస్సార్ సీపీని వీడబోయేదిలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం తప్ప చేసిన అభివృద్ధి ఏముందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సర్పంచ్లను సైతం ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త హెన్నీక్రిస్టినా మాట్లాడుతూ అబద్దం అనే మాట పుట్టిన తరువాతే చంద్రబాబు పుట్టారని ఎద్దేవా చేశారు.
నీచ రాజకీయాలకు టీడీపీ నాంది
Published Fri, Feb 26 2016 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement