నెల్లూరు(నవాబుపేట): మల్లెంకొండ ఆటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఘటనపై జిల్లా అటవీశాఖ అధికారి శివాల రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసుల్లో కొందరి సహకారం ఉందని ఆరోపించారు. అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీశాఖ బేస్క్యాంప్ సిబ్బందిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిలకలమర్రి సమీపంలోని మల్లెంకొండ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తమ శాఖ బేస్క్యాంప్ సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిలో ఇద్దరిని వదిలేయగా,మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పీకేపాడుకు చెందిన ఎర్ర ఓబయ్య, సోమశిలకు చెందిన పరుచూరి మాలకొండయ్య రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరారన్నారు. కేవలం రూ.6 నుంచి రూ.7 వేలు జీతంతో పనిచేస్తున్న బేస్క్యాంప్ సిబ్బందితో ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఈ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. బేస్క్యాంప్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని 36 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారన్నారు. వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ సెంథిల్కుమార్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరుతామని, న్యాయం జరగని పక్షంలో విధుల బహిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్కు అడ్డుకట్ట
పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్ను అరికట్టేందుకు వీలవుతుందని డీఎఫ్ఓ రాంబాబు పేర్కొన్నారు. బేస్క్యాంప్ సిబ్బందిపై దాడి చేసి ఏదో సాధించామని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. చిత్తూరుతో పాటు నెల్లూరులోనూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయన్నారు. ఆయన వెంట ఆత్మకూరు, కావలి, ఉదయగిరి రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాల్యాద్రి, తదితరులు ఉన్నారు.
పోలీసులపై డీఎఫ్ఓ ఆగ్రహం
Published Mon, Sep 29 2014 3:01 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement