వై.ఎస్.విజయమ్మ పర్యటన రేపు | Sakshi
Sakshi News home page

వై.ఎస్.విజయమ్మ పర్యటన రేపు

Published Tue, Oct 29 2013 6:09 AM

Y S Vijayamma to tour rain-hit areas in Srikakulam tomorrow

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజ యకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాల తోపాటు శ్రీకాకుళం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు.
 విజయవంతం చేయండి: కృష్ణదాస్
 జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement