'ఆదాయం రోజువారీ ఖర్చులకే..' | Sakshi
Sakshi News home page

'ఆదాయం రోజువారీ ఖర్చులకే..'

Published Thu, Mar 12 2015 1:09 PM

yanamala ramakrishnudu comments

హైదరాబాద్ : పన్నుల ద్వారా సమకూరే ఆదాయం.. జీతాలు, రోజువారీ ఖర్చులకే సరిపోతోందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కున్న ప్రత్యేక సమస్యల్ని పట్టించుకోలేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.  మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపారని, ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడే స్థాయిలో లేవని యనమల అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా యనమల.. అంబేద్కర్‌ ఆకాంక్షించిన సమానత్వాన్ని ప్రతిబింబించేలా తన బడ్జెట్‌ ఉంటుందని  భరోసా ఇచ్చారు. అంబేద్కర్‌ మాటలతో ఆయన తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన, విభజన తీరుతో రాష్ట్రం సంక్లిష్టంగా తయారైందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ మిగులు నుంచి లోటు రాష్ట్రంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని యనమల సూచించారు.

Advertisement
Advertisement