టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి,పోలీసులకు మధ్య విభేదాలు
సర్దిచెబుతూ కాలం గడుపుతున్న అధికారులు
‘కాసుల దర్శనాలే’ గొడవకు కారణం?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో పోలీసుల మధ్య పోరు కొనసాగుతోంది. భక్తులకు భద్రత కల్పించాల్సిన టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది తరచూ ఘర్షణకు దిగుతున్నారు. తమకు తెలిసిన వారిని దర్శనానికి దేవాలయంలోకి పంపించే విషయం, అదనపు లడ్డు కౌంటర్ల వద్ద టికెట్ల విషయాల్లో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి, స్థానిక పోలీసులకు తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఇది మనకు అర్థమవుతుంది.
నమోదైన ఘర్షణలు
వైకుంఠం ఒకటో గేటు వద్ద 2011 డిసెంబర్ 16న ఒక కానిస్టేబుల్ ఇద్దరు భక్తులను లోపలికి పంపుతుండగా వైకుంఠం టీటీడీ సెక్యూరిటీ వారు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది.
నడకదారి క్యూ వద్ద టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది 2012 ఏప్రిల్ 22న కొందరిని తీసుకెళుతుండగా పోలీసులు ఆపివేశారు. దీంతో గొడవ జరిగింది.
సుపథం క్యూ వద్ద 2012 అక్టోబర్ 6న ఎస్ఐ, టీటీడీ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది.
రూ.300 క్యూ వద్ద 2013 మార్చి 3న టీటీడీ సిబ్బంది, పోలీసులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పటి ఆలయ డెప్యూటీ ఈవో రమ ణ వారికి సర్దిచెప్పారు.
వైకుంఠం ఒకటి ప్రవేశ ద్వారం వద్ద 2013 ఆగస్టు 4న పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ వారు గొడవకు దిగారు. వీరికి సీవీఎస్వో అశోక్ కుమార్ సర్ది చెప్పాల్సి వచ్చింది.
అదనపు లడ్డూల కోసం టిక్కెట్ కౌంటర్ వద్ద 2013 నవంబర్ 29న ఇరువర్గాల వారికి గొడవ జరిగింది. ఏవీఎస్వో విశ్వనాథం సర్దిచెప్పారు.
రికార్డుల్లో నమోదయినా..
ఈ సంఘటనలన్నీ టీటీడీ రికార్డుల్లో నమోదయ్యా యి. అయినా అధికారులు సాదాసీదాగానే తీసుకుం టున్నారు. ఈ సంఘటనలకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సింది పోయి వారే ఘర్షణకు దిగుతున్నారు. టీటీడీ వారు కూడా జరుగుతున్న సంఘటనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసు కురావడంలో విఫలమవుతున్నారు. తాము ఎక్కువని స్థానిక పోలీసులు, కాదు మేమే ఎక్కువని టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది భావించడం వల్లనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది.
దర్శనానికి వెళుతున్నది తెలిసినవారేనా?
తిరుమలలో ఇప్పటి వరకూ పోలీసులకు, విజిలెన్స్ వారికి ఘర్షణ జరిగింది భక్తులను దర్శనానికి పంపించే క్యూల వద్ద, లడ్డూ టిక్కెట్ కౌంటర్ల వద్దే. భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకోకుండా చూడ్డంతో పాటు పిక్పాకెటర్స్ను కనిపెట్టడం వీరి బాధ్యత. అయితే వీరు భక్తుల నుంచి డబ్బు తీసుకుని బంధువులనో, తెలిసినవారనో చెప్పి దర్శనానికి పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడ విధులు నిర్వహించే వారిలో చాలా మంది సిబ్బంది ఇలాంటి దర్శనాలు చేయిస్తున్నారని సమాచారం.
తిరుమలలో పోలీసుల పోరు!
Published Tue, Feb 18 2014 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement