సాక్షి, కర్నూలు: ఇప్పటి వరకు వినూత్న నిరసనలు.. ఆందోళనలకే పరిమితమైన సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనవుతోంది. కలసి రండి.. రాజీనామాలు చేయండి.. అంటూ నేతలను ప్రాధేయపడిన ప్రజల్లో సహనం నశిస్తోంది. విభజనతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.. ఒక్కసారి ఆలోచించండని.. వేడుకున్న ఉద్యోగులు ఇక తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారు. గురువారం సమైక్య సెగతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగుదేశం నేతలు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు కాబోలు.. ప్రజల్లోకి వచ్చేందుకూ జంకుతున్నారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ మాత్రం ఎప్పటిలానే ఉద్యమ పథంలో తమ వంతు భాగస్వామ్యాన్ని నెరవేరుస్తోంది.
పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి సతీమణి విజయ నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా 48 గంటల నిరాహారదీక్ష చేపట్టిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సంఘీభావం ప్రకటించినడానికి వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిని ఉపాధ్యాయ జేఏసీ ఘోరావ్ చేసింది. దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కాటసానితో పాటు ఆయనను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యుసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించిన సమరభేరి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని లాయర్లు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని పట్టుపట్టగా.. తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన కాటసాని దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఇక యాదవ మహసభ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డికీ సమైక్య సెగ తగిలింది. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. విభజనను నిరసిస్తూ నీటిపారుదల ఉద్యోగుల జేఏసీ ఆధ్వరంలో 2వేల మంది ఉద్యోగులు జలమండలి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన్ వద్ద ఉపాధ్యాయులు వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. ఆదోనిలో ప్రాంతీయ ఆసుపత్రి.. స్త్రీలు,పిల్లల ఆసుపత్రి నర్సులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి భీమాస్ సర్కిల్లో వంటావార్పు చేపట్టారు. శస్త్ర చికిత్స ద్వారా కేసీఆర్ గుండె మార్పిడి చేసి సమైక్యవాదిగా మార్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.
వేలాది మంది రోడ్డెక్కి ఆట, పాటలతో నిరసన తెలపడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి క్రీడా మైదానాన్ని తలపించింది. నంద్యాల పట్టణంలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్స్ ర్యాలీ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్లో బట్టలు ఉతికి నిరసన తెలిపారు.
నిగ్గదీసి అడుగు.. సిగ్గులేని నేతలను
Published Fri, Aug 30 2013 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement