అందరికీ అవస్థలే.. | Sakshi
Sakshi News home page

అందరికీ అవస్థలే..

Published Fri, Aug 10 2018 7:03 AM

Young Farmer Meet Ys Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి  :రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని రౌతులపూడి మండలం డీజే పురానికి చెందిన అజన్‌కుమార్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్‌ లోనుకు సంబంధించి రూ.1.50 లక్షలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మాట మార్చి రూ.వేయి మాత్రమే ఇస్తానంటున్నారన్నారు. పింఛన్లు తీసుకునే వృద్ధులకు ఈ పోస్‌ విధానంలో వేలిముద్రలు పడక అవస్థలు పడుతున్నారని, ఆ బాధితులకు డబ్బులు ఇవ్వడం లేదని జగన్‌కు చెప్పారు. టీడీపీలో ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తామని బెదిరిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement