Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య

Published Thu, Aug 27 2015 1:48 PM

youngster commits suicide for ap special status

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడిలో గురువారం ప్రత్యేక హోదా కోరుతూ రాజశేఖర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రామిశెట్టి లక్ష్మయ్య లు ఆత్మహత్య చేసుకోగా, దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇటీవల  తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం మునికోటి ఆత్మ బలిదానం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement